‘నేనూ బడికి పోతా’ ర్యాలీ

ప్రజాశక్తి-కొత్తపట్నం: మండలంలోని గమల్లపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ‘నేను బడికి పోతా’ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంఈఓ-2 టి పద్మావతి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు పాఠశాలలో చదువుకునే విధంగా, డ్రాప్‌ అవుట్‌ అయిన పిల్లలు మరలా బడికి వచ్చే విధంగా చూడాలని కోరారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం యూనిఫామ్‌, పుస్తకాలు, ఉచిత భోజనం తదితర వసతులన్నీ కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు పి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️