దుకాణాల్లో తనిఖీలు

Jul 1,2024 20:45
ఫొటో : తనిఖీలు చేపడుతున్న అధికారులు

ఫొటో : తనిఖీలు చేపడుతున్న అధికారులు
దుకాణాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని విత్తన దుకాణాలను సహాయ వ్యవసాయ సంచాలకులు (ఇన్‌ఛార్జ్‌) ఉదయగిరి పి చెన్నారెడ్డి సోమవారం తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా విత్తన షాపులలో ఉన్న నిల్వ స్టాక్‌ రిజిస్టరు, బిల్లుపుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ విత్తనాలను సరిగ్గా నిల్వ చేసుకోవడంతోపాటు కొన్ని విత్తనాలకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని విత్తనాలను సరైన విత్తన తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మర్రిపాడు వ్యవసాయ అధికారి రామ్మోహన్‌, ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి కిషోర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️