ప్రజాశక్తి-దర్శి: స్థానిక ఆచార్య నాగార్జున ఎంజి రంగా యూనివర్సిటీ పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 36 సంవత్సరాలుగా టైం స్కేల్ ఉద్యోగిగా పనిచేసిన జూపల్లి కోటేశ్వరరావు సేవలు మరవలేనివని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి, శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్ అన్నారు. సోమవారం జూపల్లి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంధ్యారాణి మాట్లాడుతూ జూపల్లి కోటేశ్వరరావు నిరంతరం పరిశోధన స్థానంలో టైం స్కేల్ ఉద్యోగిగా అందరి మన్ననలను పొందిన వ్యక్తిగా కొనియాడారు. అనంతరం జూపల్లి కోటేశ్వరరావు సతీమణి రత్నకుమారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భారతి, ప్రజాసంఘాల నాయకులు సంఘ సేవకులు జివి రత్నం, అట్లూరి రామారావు, సందు వెంకటేశ్వరరావు, ప్రేమకుమార్, మోషే, తెనాలి రవిబాబు, రమణయ్య, రామ్మోహన్, ఉపాధ్యాయులు బసవయ్య, తిరుపతి, స్వాములుతోపాటు వ్యవసాయ పరిశోధన స్థానం ఉద్యోగులు, కృషి విజ్ఞానం కేంద్రం ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, పలువురు విలేకరులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/3-2.jpg)