నేడు పవన్‌ పర్యటనకు ఏర్పాట్లు

Jul 2,2024 23:24
ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్న

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

నేడు ఉప్పాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మంగళవారం కాకినాడ ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, పెద్దాపురం ఆర్‌డిఒ జె.సీతారామారావు ఉప్పాడ ప్రాంతంలోని సూరాడ పేటలో ఉప ముఖ్యమంత్రి పాల్గొనే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సిఎం తీర ప్రాంతాన్ని పరిశీలించి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారని తెలిపారు అలాగే నిర్మాణంలో ఉన్న మినీ హార్బర్‌ను పరిశీలిస్తారని, అక్కడున్న ఇబ్బందులను అధికారులు ఆయన దష్టికి తీసుకురానున్నారని వివరించారు. ఈ పర్యటనలో ఎంపిడిఒ నారాయణరావు, తహశీల్దార్‌ సుందర్‌రాజు, ఇఒపిఆర్‌డి భాస్కర్‌రావు, ఆర్‌ఐ ఎస్‌.పొన్నల్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️