ప్రజాశక్తి – కాకినాడ
విజెఎస్ఎంఆర్ ఒడిగోస్ సంస్థకు తెలంగాణ ఎక్సెలెన్స్ అవార్డు దక్కింది. సోమవారం స్థానిక రమణయ్యపేటలో విజెఎస్ ఎంఆర్ ఒడిగోస్ కార్యాలయంలో అభినందన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విజెఎస్ఎంఆర్ ఒడిగోస్ టెక్నాలజీస్ మేనేజింగ్ పార్టనర్ వార వినోద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ ఎక్సెలెన్స్ అవార్డు ప్రధానోత్సవంలో టాలీవుడ్ హీరోయిన్ భూమిక చావాలా చేతుల మీదుగా బెస్ట్ రీజినల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ రెక్యూరిటిమెంట్ కంపెనీ కేటగిరీలో తెలంగాణ ఎక్సెలెన్స్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సివైఎఫ్ డైరెక్టర్ మూర్తిరాజు, పోస్టల్ యూనియన్ నాయకులు వార సత్యనారాయణ మాట్లాడారు. అవార్డు గెలుచుకున్న విజెఎస్ఎంఆర్ ఒడిగోస్ను డాక్టర్ వంశీకృష్ణరాజా, ఎస్సి కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ గగారిన్, వాసిరెడ్డి ఏసుదాస్, డాక్టర్ పివివి.సత్యనారాయణ, బాలాజీ, జాషువు గిరి, ఒడిగోస్ మేనేజర్ శిరీష అభినందించారు.