భీమేశ్వర దేవస్ధానం ఇఒ సిబ్బందికి సన్మానం

Feb 27,2024 15:36

దేవస్థానం ఈవో కార్యాలయ సిబ్బందిని అభినందించి సన్మానించిన కలెక్టర్‌ శుక్లా

ప్రజాశక్తి-రామచంద్రపురం

పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మంగళవారం దేవస్థానం ఇఒ తారకేశ్వరరావును కార్యాలయ సిబ్బందిని అభినందించి సత్కరించారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం స్వయంగా కలెక్టర్‌ పర్యవేక్షించారు. సాంప్రదాయంగా భక్తిశ్రద్ధలతో కళ్యాణం జరిపించినందుకు దేవాలయ అర్చక స్వాములను, కార్యనిర్వహణాధికారి వారిని, సిబ్బందిని అందర్నీ పేరుపేరునా అభినందించి మెమెంటోలు, శాలువాలతో సత్కరించారని ఇఒ పితాని తారకేశ్వరరావు విలేకరులకు తెలిపారు. కార్యాలయ సిబ్బందిని, అర్చకులను సన్మానించినందుకు జిల్లా కలెక్టర్‌ శుక్లాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దేవస్థానం ఈవో కార్యాలయ సిబ్బందిని అభినందించి సన్మానించిన కలెక్టర్‌ శుక్లా

➡️