సంక్షేమమే ధ్యేయంగా టిడిపి సూపర్‌ సిక్స్‌

Mar 27,2024 16:45

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ జోగేశ్వరరావు

ప్రజాశక్తి-మండపేట

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టిడిపి సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టో రూపొందించిందని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో 10,11,12 వార్డుల బూత్‌ ఇన్‌ ఛార్జ్‌లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో దేశంలోనే ఎపిని నంబర్‌-1 స్థానంలో నిలిపిన జగన్‌ దారుణాలను ప్రజలందరూ పంటిబిగువున భరిస్తున్నారన్నారు. కష్టాలు తీరి, రాష్ట్రం అభివద్ధి బాట పట్టాలంటే కూటమినే గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, సాధనాల చక్రపాణి, సిరంగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️