ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

ప్రజాశక్తి-కొండపి: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాటిని బలోపేతం చేసేందుకు తోడ్పాటు నందించాలని మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, గ్రామ నాయకుడు బూదవాటి సోమయ్య కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక ద్వారా స్కూల్‌ బ్యాగులు, యూనిఫామ్‌, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అన్ని సదుపాయాలూ కల్పిస్తుందని అన్నారు. మధ్యాహ్న బోజనం వసతి కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించారని, విద్యార్థులు ఉన్నత శిఖరాలు సాదించాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, సిబ్బంది ఉన్నారు.

➡️