ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి రెండో వార్డు ఆదర్శనగర్లో ఉచితంగా నిర్వహిస్తున్న మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణా శిబిరాన్ని పిఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకులు నరసింహారావు ఆదివారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న బాల బాలికలకు పాలు, కోడి గుడ్లు, బిస్కెట్లు అందజేశారు. శిక్షణా శిబిరం నిర్వాహకులు బి.పరదేశి, గౌతమ్, వైసిపి నాయకులు తమ్మిన అశోక్ పాల్గొన్నారు.