ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : పరిమితికి మించి స్కూల్ పిల్లలను ఎక్కించి మెయిన్ రోడ్డుపై వెళుతున్న ఆటోను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అడ్డుకున్నారు. మంగళవారం పట్టణంలోని మెయిన్ రోడ్ లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటోను ఆపి పరిమితికి మించి స్కూల్ పిల్లలను ఎక్కించుకోవడం వల్ల అనేక ప్రమాదాలు ,ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్కువగా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని ఆటో డ్రైవర్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయం పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆటోలో మొత్తం ఎంతమంది పిల్లలను ఎక్కిస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలని, అధిక లోడుతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఈ విషయమై పోలీసులు ఎప్పటికప్పుడు గమనించాలని ఈ సందర్భంగా సుభాష్ సూచించారు. మంత్రి వెంట పలువురు కార్యకర్తలు ఉన్నారు.