అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

May 17,2024 21:29

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ నియోజకవర్గం కంచల – కీసర గ్రామ ఇసుక స్టాక్‌ యాడ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా తరలిస్తున్నారు. ఇసుక బిల్లులు ఇవ్వకుండా అనధికారికంగా వ్యవహారం సాగుతున్నట్టు తెలిసింది. ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇసుక ఎప్పుడూ తరలించాలి. మైనింగ్‌, రెవిన్యూ, అధికారులు అనుమతి లేవని చెప్పినప్పుడు అక్రమ ఇసుక తరలింపునకు కంచికచర్ల పోలీసులు సహకరిస్తున్నారు. వర్షాకాలంలో నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇసుక తరలింపు చాలా కష్టం ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు, ఇల్లు నిర్మించుకునే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ప్రతిపాదన ఇసుక స్టాక్‌ పాయింట్‌.వేసవి కాలంలో కీసర ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏ అధికారులు అనుమతులు ఇచ్చారో తెలపాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఈ స్టాక్‌ పాయింట్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే వచ్చే వర్షాకాలంలో భవన నిర్మాణ కార్మికులకు పని దొరికేది ఎలా అని వారి కుటుంబాలు రోడ్డున పడుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️