విజయవాడలో విషాదం

Apr 30,2024 22:14
  • ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
  • నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌
  • ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు

విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్‌ తన నలుగురు కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని గురునానక్‌ కాలనీలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ (40)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతోపాటు తల్లి కూడా ఆయన వద్దే ఉంటోంది. మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లిన పని మనిషికి బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరివేసుకుని ఉండటం చూసి కంగారు పడి చుట్టుపక్కల వారికి చెప్పింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న పోలీసు సిబ్బంది లోపలకు వెళ్లి చూడగా శ్రీనివాసరావు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆయన భార్య భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), శ్రీహాన్‌ (8), తల్లి రమణమ్మ (65) రక్తపు మడుగులో పడి ఉన్నారు. భార్యా, పిల్లలు, తల్లి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వారి గొంతుకలు కోసి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డాక్టర్‌ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ?డాక్టర్‌ శ్రీనివాస్‌ గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ కోర్సును పూర్తిచేశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొన్నేళ్లు వైద్యులుగా సేవలందించారు. అనంతరం ఏడాది క్రితం సొంతంగా పుష్పా హోటల్‌ సెంటర్‌ సమీపంలో శ్రీజ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. అయితే ఆస్పత్రి పూర్తి స్థాయిలో సరిగా నడవకపోవడం, ఇతర కారణాలతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర మస్థాపానికి గురై డిప్రెషన్‌కు లోనై కుటుంబ సభ్యులను చంపి ఆత్మ హత్యకు పూనుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విచారణ వేగవంతంనగర పోలీస్‌ కమిషనర్‌ హెచ్‌డిఎఫ్‌ రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఎంటి ఎదురుగా ఉన్న మరొకరి ఇంటి పోస్టుబాక్సులో ”నా కారు తాళం తన అన్నకు ఇవ్వాలి’ అని రాసిన లెటర్‌ను ఆత్మహత్యకు ముందు వేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యకు సంబంధించి ముందుగా రాసిన సూసైడ్‌ లెటర్‌గా పోలీసులు భావిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు చంపి, తెల్లవారు జామున డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

➡️