మున్సిపల్‌ కార్మికుల బకాయి జీతాలు చెల్లించండి

Jul 1,2024 21:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పాలక సంస్థ తాగునీటి పంపింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కమిషనర్‌కు సోమవారం వినతినిచ్చారు. యూనియన్‌ నాయకులు ఎ.జగన్మోహన్‌, నారాయణరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. మేన్‌ ,మెటీరియల్‌ వేరు చేసి 70 మందిని ఆప్కాస్‌ లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.ప్రజా వినతుల పరిష్కార వేదికకు 12 వినతులు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థకు 12 వినతులు వచ్చాయి. నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎంఎం నాయుడు వినతులు స్వీకరించారు. అనంతరం కమిషనర్‌ ఎంఎం నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎసిపి అమ్మాజీ రావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి, వివిధి విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️