ప్రజాశక్తి డాక్టర్స్‌డే ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ప్రజాశక్తి డాక్టర్స్‌డే ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

 

విజయశ్రీ హాస్పిటల్‌లో ప్రజాశక్తి డాక్టర్స్‌డే ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ప్రజాశకి- మధురవాడ : డాక్టర్స్‌డే సందర్బంగా ప్రజాశక్తి ముద్రించిన డాక్టర్స్‌డే ప్రత్యేక సంచికను పిఎంపాలెం క్రికెట్‌ స్టేడియం దరి విజయశ్రీ హాస్పిటల్‌లో న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ బగాది సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎండోక్రనాలజిస్ట్‌ డాక్టర్‌ పైడి వేణుమాధవి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ, ఎటువంటి లాభాపేక్ష లేకుండా 44 ఏళ్లుగా ప్రజాసమస్యలను వెలుగులోకి తేవడం, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రజాశక్తి తెలుగు దినపత్రిక ఏటా మాదిరిగానే డాక్టర్స్‌ డే సందర్బంగా వైద్యులను అభినందిస్తూ ప్రత్యేక సంచికను తీసుకురావడం అందులో ప్రజారోగ్యానికి సంబంధించి నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలతో ప్రత్యేక కథనాలను ప్రచురించడం అభినందనీయమన్నారు ఈ సందర్బంగా ప్రజాశక్తి యాజమాన్యానికి, సిబ్బందికి, పాత్రికేయులకు డాక్టర్‌ సునీల్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విజయశ్రీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు

ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ సునీల్‌కుమార్‌, డాక్టర్‌ వేణుమాధవి

➡️