ప్రజాశక్తి-గిద్దలూరు: స్థానిక అరుణోదయ పాఠశాలలో చదివి నేడు ఎంతో ఎత్తుకు ఎదిగి వైద్యులుగా ప్రజలకు సేవలందిస్తున్న అరుణోదయ పూర్వ విద్యార్థులు డాక్టర్ ఎం విజయభాస్కర్, డాక్టర్ జి రమేష్బాబు, డాక్టర్ కిరణ్ కుమార్లను డాక్టర్స్డే సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జడ్ చంద్రశేఖర్ శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించి నేడు ప్రజలందరూ గర్వించదగ్గ స్థాయికి ఎదగడానికి ఎంతో కృషి, పట్టుదల కావాలని అన్నారు. నాడు పట్టుదల, కృషితో చదివి నేడు వైద్యులు కావడం అరుణోదయ పాఠశాలకే గర్వకారణమని అన్నారు. పూర్వ విద్యార్థులైన డాక్టర్లు మాట్లాడుతూ కష్టపడి చదివితే తామే కాదు ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నేటి విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.