ఫొటో : మంత్రి ఆనంకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
సోమశిల జలాశయంను కాపాడండి..
ప్రజాశక్తి-అనంతసాగరం : సోమశిల జలశయాన్ని కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రితో మాట్లాడుతూ గతంలో వచ్చిన భారీ వర్షాలు, వరదలకు సోమశిల జలాశయం కిందిభాగం అఫ్రాన్ పూర్తిగా దెబ్బతిన్నదని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిన్న జలాశయంను పట్టించుకోకుండా వదిలేశారన్నారు. జిల్లా రైతాంగానికి ఈ జలాశయం ప్రాణవాయువు లాంటిదని దెబ్బతిన్న జలాశయం పనులు పూర్తి చేయకుండా ఉంటే భవిష్యత్తులో వచ్చే వరదలకు జలాశయం మొత్తం దెబ్బతినే పరిస్థితులున్నాయన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సోమశిల జలాశయం పనులు ప్రారంభించి జలశయాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అన్వర్ బాషా, మండల కమిటి సభ్యులు డాక్టర్ సుబ్బరాయుడు, వేము పెంచలయ్య, ఉప్పలపాడు మస్తాన్, గాడి సుధాకర్, సంధాని, తదితరులు పాల్గొన్నారు.
![ఫొటో : మంత్రి ఆనంకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు](https://prajasakti.com/wp-content/uploads/2024/07/anantha-1-scaled.jpg)