న్యాయ విజ్ఞాన సదస్సులో సూచనలు ఇస్తున్న అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ
హిందూపురం : అర్హత కలిగిన వారందరికీ ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ తెలిపారు. శనివారం స్థానిక అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చాలామంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేక పోతుంటారని అలాంటి వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే జిల్లా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కోట్నురు నిర్మల వద్ధాశ్రమంలో జరిగిన సదస్సులో న్యాయవాదులు మాట్లాడుతు వద్ధులపై ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కుమార్తెలపై కూడా ఉంటుందని తెలిపారు. ఆశ్రయం లేని వద్దులు భరణం కోసం న్యాయస్థానాల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం వద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా జరిగిన లోక్ అదాలత్లో పలు కేసులను పరిష్కరించి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో న్యాయవాదులు సుదర్శన్, పీవీ శ్రీనివాస్ రెడ్డి, వన్నెరప్ప, పార్వతి, నవేరా, రామిరెడ్డి, భరత్, రవిచంద్ర, గురునాథ్, గోపాల్, ఎస్ఐ హారూన్బాషా, లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, లోక్ అదాలత్ సిబ్బంది శారద పాల్గొన్నారు.