పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటుతున్న వాలంటీర్లు
హిందూపురం : పట్టణంలోని సప్తగిరి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం సేవా మందిర్ ఆంధుల పాఠశాల ఆవరణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలను నాటారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ మంజూనాథ్, ఎఒ గంగిరెడ్డి మాట్లాడుతు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఒలు ప్రకాష్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.