రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన రొద్దం ఖోఖో జట్
రొద్దం : పుట్టపర్తిలో బుధవారం జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోని నియోజకవర్గ పోటీలలో గెలుపొందిన వారికీ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఖోఖో విభాగంలో రొద్దం మండలంలోని కలిపి సచివాలయ బాలుర జట్టు విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినట్లు పంచాయితీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను పంచాయతీ అధికారులు, నాయకులు అభినందించారు.