కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి : సిఐటియు

Jul 1,2024 22:08

మంత్రికి వినతిని అందజేస్తున్న నాయకులు, కార్మికులు

                    సోమందేపల్లి : పరిగి గ్రామపంచాయతీ కార్మికులకు 10నెలలు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి సవితమ్మ స్వగృహం వద్ద పరిగి పంచాయతీ కార్మికులతో కలసి కార్మికుల సమస్యలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా రమేష్‌ మాట్లాడుతూ కార్మికులకు గత 11 నెలలు అరియర్స్‌ ఇవ్వలేదన్నారు. నూనె ,సబ్బులు , చెప్పులు, చెప్పులు, ఇవ్వాలని కోరారు. రెండు నెలల నుండి కార్మికుల సమస్యలను సర్పంచి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. మంత్రి స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు మూర్తి, రామాంజి, కార్మికులు పాల్గొన్నారు.

➡️