ప్రజాశక్తి-బత్తలపల్లి : తెలుగు దేశం పార్టీలోకి చేరిన మాజీ వైస్ ఎంపీపీ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో బత్తలపల్లి మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి తిరిగి వచ్చారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించేలా కృషి చేయాలన్నారు. ఈ మండల కన్వీనర్ జయరామిరేడ్డి, సచివాలయం కన్వీనర్ రాంభూపాల్, బండి వీరానారప్ప, మెహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![join in ycp](https://prajasakti.com/wp-content/uploads/2024/01/join-in-ycp.jpg)