క్లబ్ను ప్రారంభిస్తున్న నారాయణరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
టూరిజం క్లబ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని డిటిఒ నడిమింటి నారాయణరావు అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా అగ్రి టూరిజం యువ టూరిజం క్లబ్ను ఎచ్చెర్ల మండలంలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ బిఎస్సి అగ్రికల్చర్ విద్యార్థులతో శనివారం ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ వి.శ్రావణి, ఆఫీస్ ఇన్ఛార్జి డాక్టర్ శివ, డాక్టర్ కెవిఎస్ఎల్ రాజురుషి పాల్గొన్నారు.