అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ప్రారంభంప్రజాశక్తి-శ్రీకాళహస్తి: దేశంలోనే అతిపెద్ద కంటి సంరక్షణా కేంద్రాలలో ఒకటైన డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ బుధవారం శ్రీకాళహస్తిలో ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి ఐ క్లినిక్ను ప్రారంభించారు. నిపుణులైన వైద్యులు సంపూర్ణ కంటి ఆరోగ్య చెక్- అప్స్ ఉచితంగా అందిచడమే కాకుండా, రిఫ్రాక్షన్ డిగ్రీ, కంటి ఒత్తిడి, విజువల్ తీక్షణతలను ఖచ్చితంగా అంచనావేయుట ఆసుపత్రి ప్రత్యేకతలని వైద్యులు తెలిపారు. ట్రస్టు బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, అగర్వాల్స్ వైద్యులు పాల్గొన్నారు.
![అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ప్రారంభం](https://prajasakti.com/wp-content/uploads/2023/12/66666666666666666-1.jpg)