కందారపు మురళి ఆరోగ్యం విషమంరుయా వైద్య బృందం వెల్లడి ప్రజాశక్తి – తిరుపతి టిటిడి అటవీ కార్మికులకు మద్దతుగా నిరవధిక దీక్ష చేపట్టిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళితో పాటు, అటవీ కార్మికుల ఆరోగ్యం మరింత విషమించిందని రుయా వైద్య బృందం డాక్టర్లు హారిక ,ఉష, పథ్వి ప్రకటించారు. సోమవారం రాత్రి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న వైద్య బృందం కార్మిక నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవల్స్ పడిపోయాయని, ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వెల్లడించారు. అయితే అటవీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు తాము దీక్ష విరమించబోమని, అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికైనా వెనకాడబోమని కందారపు మురళి స్పష్టం చేశారు.
![కందారపు మురళి ఆరోగ్యం విషమంరుయా వైద్య బృందం వెల్లడి](https://prajasakti.com/wp-content/uploads/2024/01/444444444444444444-1.jpg)