ధర ఉన్నా.. ధాన్యం లేక..శ్రీ సాగు నీరు లేక ఆవేదనశ్రీ షుగర్లెస్ 77 కిలోల బస్తా రూ.2050శ్రీ కల్లాల్లోనే అమ్మేస్తున్న రైతులు 5, 6 తేదీల్లో పశువిజ్ఞాన ప్రదర్శన ప్రజాశక్తి – క్యాంపస్ తిరుపతిలోని వెటర్నరీ కాలేజీ పశువిజ్ఞాన ప్రదర్శన మార్చి 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ ప్రదర్శన స్కూల్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.జగపతి రామయ్య తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు పోలీసు జాగీలాలతో, గుర్రపు స్వారీ ప్రదర్శన ఉంటుంది. అనాటమీ, పెథాలజీ మ్యూజియంలు, డెయిరీ టెక్నాలజీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. పాలిటెక్నిక్, ఏపిఆర్జెసి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానంప్రజాశక్తి – క్యాంపస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతి మార్చ్/ఏప్రిల్ 2024 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మారి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి ఏప్రిల్ 5 వరకు గడువు ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27న జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 8688888802/03, 9399976999 నెంబరులకు సంప్రదించవచ్చునని వెల్లడించారు.
ధర ఉన్నా.. ధాన్యం లేక..శ్రీ సాగు నీరు లేక ఆవేదనశ్రీ షుగర్లెస్ 77 కిలోల బస్తా రూ.2050శ్రీ కల్లాల్లోనే అమ్మేస్తున్న రైతులు 5, 6 తేదీల్లో పశువిజ్ఞాన ప్రదర్శన
![ధర ఉన్నా.. ధాన్యం లేక..శ్రీ సాగు నీరు లేక ఆవేదనశ్రీ షుగర్లెస్ 77 కిలోల బస్తా రూ.2050శ్రీ కల్లాల్లోనే అమ్మేస్తున్న రైతులు 5, 6 తేదీల్లో పశువిజ్ఞాన ప్రదర్శన](https://prajasakti.com/wp-content/uploads/2024/03/ddddddddddddddd.jpg)