వేడుకగా పాచికాల్వ గంగమ్మ జాతరపాల్గొన్న టిడిపి శ్రేణులుప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో పాచికాల్వ గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. టీడీపీ తిరుమల అధ్యక్షులు రాజుయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గంగ జాతరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎంపీ పనబాక లక్ష్మీతో సహా తిరుపతి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలుతిరుమలకు చేరుకొని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేకపూజలు చేసారు. శ్రీవారికి తోబుట్టువుగా, గ్రామదేవతగా ప్రజలు పూజలందకుంటున్న పాచికాల్వ గంగమ్మతల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, త్వరలో మంచి పరిపాలన ఏర్పాటు కావాలని ప్రార్థించారు.
![వేడుకగా పాచికాల్వ గంగమ్మ జాతరపాల్గొన్న టిడిపి శ్రేణులు](https://prajasakti.com/wp-content/uploads/2023/12/12121212-1.jpg)