‘శ్రీనివాససేతు’కి జాతీయస్థాయిలో మొదటి అవార్డుప్రజాశక్తి -తిరుపతి టౌన్తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీనివాససేతు ప్లై ఓవర్ బ్రిడ్జ్ కు జాతీయస్థాయిలో మొదటి స్థానం అవార్డ్ దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిడ్జ్ ఇంజనీర్స్ వారు ముంబాయిలో శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో తిరుపతి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీనివాససేతు ప్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ మొదటి స్థానం పొందినందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్కు, ప్లై ఓవర్ పనులను చేపట్టిన అప్కాన్స్ ప్రతినిధి రంగస్వామికి అవార్డును అందజేశారు.
!['శ్రీనివాససేతు'కి జాతీయస్థాయిలో మొదటి అవార్డు](https://prajasakti.com/wp-content/uploads/2024/02/1111111111111111.jpg)