శ్రీసిటీ ఎండి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరైన సిఎంప్రజాశక్తి- తిరుపతి టౌన్: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలోని తాజ్హోటల్ నందు జరిగిన శ్రీసిటి ఎండి రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు బుధవారం సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక తాజ్ హోటల్లో జరిగిన శ్రీసిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై వధువు నిరీష, వరుడు సాగర్లకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించి 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు పయణమయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్రవిద్యుత్, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే, టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధనరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి ముఖ్యమంత్రికి సాదర స్వాగతం, వీడ్కోలు పలికారు.