స్విమ్స్ పరిశోధక విద్యార్థికి డాక్టరేట్ ప్రదానంప్రజాశక్తి – తిరుపతి సిటిశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీలో బయోటెక్నాలజీ విభాగం నందు పరిశోధనలు నిర్వహించిన విద్యార్థిని కటారు సురేఖకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను ప్రదానం చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. ప్రొఫెసర్ పివిజికె శర్మ పర్యవేక్షణలో ‘ఇన్ విట్రో జనరేషన్ ఆఫ్ మిసాన్ జియల్ సెల్స్ ఫ్రమ్ హ్యూమన్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్’ అనే అంశముపై పరిశోధన చేశారు.