స్విమ్స్, రుయాలో ఆరోగ్యశ్రీ వార్డుల పరిశీలనప్రజాశక్తి – తిరుపతి సిటి ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డాక్టర్ జి . లక్ష్మీ శ తిరుపతి జిల్లా స్విమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్, ఐసియు వార్డులో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఆరోగ్య శ్రీ సేవలు ఉచితంగా అందుతున్నాయని సీఈఓకి వివరించారు. జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్ సీఈఓ వెంట ఉన్నారు. అనంతరం రుయా ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న సర్జరీ రోగులను విచారించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, డీఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీహరి, డిప్యూటీ కలెక్టర్ భాస్కర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
![స్విమ్స్, రుయాలో ఆరోగ్యశ్రీ వార్డుల పరిశీలన](https://prajasakti.com/wp-content/uploads/2024/05/t11.jpg)