ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను ఈవో ఎవి.ధర్మారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.