ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): పిచ్చాటూరు ఐసిడిఎఫ్ కేంద్రం వద్ద అంగన్వాడి వర్కర్స్ మూడవరోజు గురువారం తమ డిమాండ్లను నెరవేర్చేంతవరకు నిరవధిక దీక్ష చేపట్టారు. నాలుగు మండలాల అంగన్వాడి వర్కర్స్ మోకాళ్ళతో నిరసన తెలిపారు. మూడవ రోజు సమ్మెను తీవ్రతరం చేయుటలో భాగంగా ఎరుపు రంగు చీర ధరించి నిరసన తెలిపారు. దీక్షకు మద్దతుగా టిడిపి నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మండల క్లస్టర్ డి ఇలంగోవన్ రెడ్డి మద్దతు తెలిపారు.