మాట్లాడుతున్న కార్పొరేట్ అఫైర్స్ హెడ్జి. వేణుగోపాల్విలువలతో కూడిన విద్య-పోర్ట్ కార్పొరేట్ అఫైర్స్ హెడ్ వేణుగోపాల్..ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:విలువలతో కూడిన విద్యాభివృద్ధికి అదాని ఫౌండేషన్ కృషి చేస్తోందని అదాని కృష్ణపట్నం పోర్ట్ కార్పొరేట్ అఫై ర్స్ హెడ్ జి. వేణుగోపాల్ పేర్కొ న్నారు. కృష్ణపట్నం పంచాయతీ అ ర్కాటపాలెంలోని అంగన్వాడీ సెంటర్లో అదాని ఫౌండేషన్, అదాని కృష్ణపట్నం పోర్టు, సహకారంతో సోమ వారం ప్లే క్లాస్, ఎల్ కేజి, యుకేజి ఇంగ్లీష్ మీడియం తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బం గా వేణుగోపాల్ మాట్లాడుతూ అదాని కృష్ణ పట్నం పోర్టు అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి పాటుప డుతున్నట్లు తెలిపారు. అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పు స్తకాలను విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదాని ఫౌండేష న్ హెడ్ రాజేష్ రంజన్ విద్య ప్రాము ఖ్యతను విద్యార్థులు, త ల్లిదండ్రులకు వివరించారు. కార్య క్రమంలో పోర్ట్ ప్రతినిధులు కె.ముత్యంజరు రా మ్, డాక్టర్ రమేష్ బాబు, ఎంపీటీసీ సభ్యులు జయలక్ష్మి, మొలకయ్య, పోలయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.