అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేయడం ప్రజా విజయం

Mar 15,2024 11:04 #Vizianagaram

 పోరాటంలో కలిసివచ్చిన ప్రజా సంఘాలు కు,ప్రజలకు కృత్ఞతలు
నగరంలో ఉన్న అక్రమ వాటర్ ప్లాంట్ లను సీజ్ చేయాలని డిమాండ్
పట్టణ పౌర సంక్షేమ సంఘం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏడాది కాలంగా అయ్యప్ప నగర్ లో ఉన్న అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేయాలని చేసిన పోరాట ఫలితంగా వాటర్ ప్లాంట్ నీ సీజ్ చేసినా అధికారులకు,మా పోరాటానికి అండగా నిలిచిన ప్రజా సంఘాలు నాయకులు కు,వార్డు ప్రజలకు పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు,అయ్యప్ప నగర్ పోరాట కమిటీ కన్వీనర్ యు ఎస్ రవికుమార్ లు అభినందనలు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎల్ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజ్ చేసినా దృశ్యాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏడాది కాలంగా అయ్యప్ప నగర్ లో అక్రమంగా ఉన్న స్వాతి ప్యూర్ ఫైర్ వాటర్ ప్లాంట్ వలన కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూ గర్భ జలాలు ఇంకీ పోవడం వలన చుట్టూ ప్రక్కల నివాసాలకు నీరు అందక పోవడం వలన నీటి కి ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇదే విషయాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసిన ఏడాది కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారన్నారు..అక్రమ వాటర్ ప్లాంట్ అని ఆధారాలు రుజువు కావడంతో ఎట్ట కాలంగా అధికారులు గురువారం అధికారులు వాటర్ ప్లాంట్ నీ సీజ్ చేయడం జరిగిందన్నారు. ఏడాది కాలంగా జరిపిన పోరాటంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం,ఇతర ప్రజా సంఘాలు,వార్డు ప్రజలు అండగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలిపారు. అదే విధంగా నగరంలో అనేక అక్రమ వాటర్ ప్లాంట్ లు ఉన్నాయన్నారు. అక్రమ వాటర్ ప్లాంట్ లను సీజ్ చేసి నగర ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే నగరంలో సుమారుగా 8 వాటర్ ప్లాంట్ లను పోరాటం చేసి సీజ్ చేయడం జరిగిందన్నారు. పుట్టగొడుగుల్లా ఉన్న వాటర్ ప్లాంట్ లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మా పోరాటానికి మద్దతు ఇచ్చి, అక్రమ వాటర్ ప్లాంట్ నీ సీజ్ చేయడానికి సహకరించిన అధికారులకు,ప్రజలకు,ప్రజా సంఘాలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. విలేకర్ల సమావేశంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కంది. త్రినాథ్,ఎన్.సుధీర్ లు పాల్గొన్నారు.

➡️