ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన సిఇఒగా సిహెచ్ ఉమా మహేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎటువంటి ఒడి- దుడుకులు లేకుండా జిల్లా ప్రజలకు సెంట్రల్ బ్యాంక్ ద్వారా మెరుగైన సేవలు అందిచాలని జెడ్పి చైర్మన్ సూచించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/dccb-ceo.jpg)