ప్రజాశక్తి-నర్సీపట్నం : నర్సీపట్నం ఎన్టిఆర్ స్టేడియం వద్ద నిన్న రాత్రి నుండి అంగన్వాడీలను ఛలో విజయవాడకు వెల్లకుండా ఆదివారం సాయింత్రం నుండి ఎక్కడ కనబడితే అక్కడ వాహనాలను నిలిపివేసి, నాతవరం, నర్సీపట్నం పోలీసు స్టేషన్లకు తరలించి కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేసారు. అలాగే రాస్ట్ర కేంద్రంలో సమ్మె శిబిరాన్ని కూల్చివేసి, మహిళలను చూడకుండా ఇబ్బందులకు గురిచేయుడాన్ని ఖండీస్తూ రాష్ట్రా ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, సిఐటియు జిల్లా కమిటీ సబ్యులు రొంగల దేముడు నాయుడు, టి.ఈ ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు.