ప్రజాశక్తి – నరసాపురం టౌన్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 2024 క్యాలెండర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళల స్థితిగతులపై క్యాలెండర్ వేస్తున్నామన్నారు. సహాయ సహకారాలు అందిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కేతా పద్మజ, బంకుర యశోద, బాసిన శ్యామల, సందక ఉదయకుమారి, డి.లక్ష్మి, బి.సుగుణ, ఎం.సరోజినీ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/4444-7.jpg)