పెనుగొండ: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికలఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ ఎస్తేర్ క్విన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. పెనుగొండ సర్పంచి నక్క శ్యామల సోనీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యాబోధన, క్రమశిక్షణ నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, కనక దుర్గ, మంగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/IMG-20240701-WA0034.jpg)