నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జి
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
మండలంలో అన్నా క్యాంటీన్ను అందరి సహకారంతో నిరంతరంగా కొనసాగిస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాజ్జి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో అన్నా క్యాంటీన్ వద్ద 88వ మంగళవారం అన్నదానం కార్యక్రమాన్ని పట్టణ 20వ వార్డు టిడిపి ప్రెసిడెంట్ వుల్లంగిల చిన్న దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడానికి టిడిపి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టిందన్నారు. దాతల సహకారంతో గత 88 వారాలుగా ఈ అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.