నైతిక ప్రమాణాలను కోల్పోయిన భారత్‌

Jan 2,2024 07:15 #Editorial

ఇజ్రాయిలీలు పాలస్తీనియన్లను నిర్దాక్షిణ్యంగా చంపడం గురించి మనం ఏమీ మాట్లాడకుంటే, మనం కూడా దానిలో భాగస్వాములమైనట్లే. మన నైతికతలో ఏదో ఒక మార్పు శాశ్వతంగా ఉంటుంది. ఇళ్ళు, ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు, పాఠశాలలు, యూనివర్సిటీల పై బాంబులు కురిపిస్తుండగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైనప్పుడు, శిథిలాల కింద నుంచి ప్రాణాలు కోల్పోయిన పిల్లల్ని బయటకు లాగుతున్నపుడు, మనం సహాయం చేస్తున్నామా? గాజా సరిహద్దులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎక్కడికీ వెళ్ళలేరు. వారికి గూడు, కూడు, నీళ్ళు లేవు. సగం కంటే ఎక్కువ జనాభా ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి చెప్తున్నది. అయినా వారిపై నిర్విరామంగా బాంబులతో దాడి చేస్తున్నారు. ఒక జాతి హననాన్ని పట్టించుకోలేని స్థాయికి మొత్తం ప్రజల్ని అమానవీయంగా మార్చడాన్ని మరోసారి చూడబోతున్నామా మనం ?

               నేనీరోజు అత్యవసరమైన విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మన దేశం తన నైతిక ప్రమాణాలను కోల్పోయింది. అత్యంత హేయమైన నేరాలు, జాతి సంహారం, జాతి ప్రక్షాళనకు పిలుపునిచ్చే భయంకరమైన ప్రకటనలను రాజకీయ ప్రతిఫలాలతో స్వాగతిస్తున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుండగా, పేదలకు రొట్టె ముక్కలు విసరడమనేది వారిని పేదలుగా మార్చే శక్తులకు మద్దతునివ్వడమే అవుతుంది.నేడు మనల్ని తికమక పెట్టే చిక్కు సమస్య ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమను తాము నిర్వీర్యం చేసుకునే విధంగా ఓట్లు వేస్తున్నట్లు కనపడుతున్నారు. వారు అందుకుంటున్న సమాచారం ఆధారంగా వారు ఈ పని చేస్తున్నారు. ఆ సమాచారం ఏమిటి? దానిని నియంత్రించేదెవరు? ఎవరు సాంకేతికతను నియంత్రిస్తారో వారే ప్రపంచాన్ని నియంత్రిస్తారు. కానీ చివరికి, ప్రజల్ని ఎవరూ నియంత్రించలేరనీ, ఒక కొత్తతరం తిరుగుబాటు చేస్తుందని నేను నమ్ముతాను. అక్కడ ఒక విప్లవం వస్తుంది. క్షమించండి, విప్లవాలు వస్తాయి.

ఒక దేశంగా, మనం మన నైతిక ప్రమాణాలను కోల్పోయామని నేను అన్నాను. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు-యూదులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, కమ్యూనిస్టులు, నాస్తికులు గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలనే పిలుపుతో ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వలస ప్రజలకు, పాలస్తీనాకు నిజమైన స్నేహితుడు, ఒకప్పుడు వేలాది మంది ప్రదర్శనలను చూసిన మన దేశంలోని వీధులు నేడు నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలామంది మన రచయితలు, ప్రజా మేధావులు, అందరూ కాదు కానీ కొద్దిమంది కూడా మౌనంగా ఉండిపోయారు. ఎంతటి ఘోరమైన అవమానం! ఎంతటి ముందు చూపు లేని తనం! మన ప్రజాస్వామ్య నిర్మాణాలు క్రమ పద్ధతిలో కూల్చివేయబడడం, అపురూపమైన వైవిధ్యంతో కూడిన మన దేశం ఒకే విధమైన జాతీయవాదం అనే సంకుచిత ఆలోచనగా మారడం గమనిస్తుంటే, తమను తాము మేధావులుగా చెప్పుకునే వారు,మన దేశం కూడా ముక్కలవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి.

ఇజ్రాయిలీలు పాలస్తీనియన్లను నిర్దాక్షిణ్యంగా చంపడం గురించి మనం ఏమీ మాట్లాడకుంటే, మనం కూడా దానిలో భాగస్వాములమైనట్లే. మన నైతికతలో ఏదో ఒక మార్పు శాశ్వతంగా ఉంటుంది. ఇళ్ళు, ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు, పాఠశాలలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ రికార్డులపై బాంబులు కురిపిస్తుండగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైనప్పుడు, శిథిలాల కింద నుంచి ప్రాణాలు కోల్పోయిన పిల్లల్ని బయటకు లాగుతున్నపుడు, మనం సహాయం చేస్తున్నామా? గాజా సరిహద్దులు మూసివేయ బడ్డాయి. ప్రజలు ఎక్కడికీ వెళ్ళలేరు. వారికి గూడు, కూడు, నీళ్ళు లేవు. సగం కంటే ఎక్కువ జనాభా ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి చెప్తున్నది. అయినా వారిపై నిర్విరామంగా బాంబులతో దాడి చేస్తు న్నారు. ఒక జాతి హననాన్ని పట్టించుకోలేని స్థాయికి మొత్తం ప్రజల్ని అమానవీయంగా మార్చడాన్ని మరోసారి చూడబోతు న్నామా మనం? పాలస్తీనియన్లను అమానవీయంగా మార్చే ప్రణాళిక బెంజమిన్‌ నెతన్యాహుతో, అతని సిబ్బందితోనే మొదలు కాలేదు. అది దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది.2002, సెప్టెంబర్‌ 11న, 2001 మొదటి వార్షికోత్సవంలో నేను అమెరికాలో ‘సెప్టెంబర్‌…రా…’ (కమ్‌ సెప్టెంబర్‌) అనే ప్రసంగం చేశాను. దానిలో నేను ఇతర సెప్టెంబర్‌ 11 వార్షికోత్సవాల గురించి మాట్లాడాను. ఆ రోజున 1973లో చిలీలో అధ్యక్షుడైన సాల్వడార్‌ అలెండీకి వ్యతిరేకంగా సీఐఏ అండతో చేసిన తిరుగుబాటు గురించి, అదేవిధంగా 1990 సెప్టెంబర్‌ 11న అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ సీనియర్‌, ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్న తన ప్రభుత్వ ప్రకటనపై మాట్లాడాను. ఆ తరువాత నేను పాలస్తీనా గురించి మాట్లాడాను. ఆ భాగాన్ని చదువుతాను. అది నేను 21 సంవత్సరాల క్రితం రాసిన విషయమని నేను మీకు చెప్పకుంటే, అది ఈ రోజు గురించేనని మీరనుకుంటారు.

”సెప్టెంబర్‌ 11 మధ్య ప్రాచ్యంలో కూడా విషాద సంకేతం లాంటిది. 1922 సెప్టెంబర్‌ 11న అరబ్బుల ఆగ్రహాన్ని పట్టించుకోకుండా బ్రిటీష్‌ ప్రభుత్వం పాలస్తీనాలో ఒక ఆజ్ఞను జారీ చేసింది. సర్వోన్నతాధికారం గల బ్రిటన్‌ జారీ చేసిన 1917 బాల్ఫోర్‌ ప్రకటనను అనుసరించి, దాని సైన్యాన్ని గాజా గేట్ల బయట కేంద్రీకరించింది. బాల్ఫోర్‌ ప్రకటన, యూదు ప్రజల కోసం ఒక జాతీయ నివాసాన్ని ఇస్తామని యూరోపియన్‌ జియోనిస్టులకు హామీ ఇచ్చింది. ఆ సమయంలో రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యానికి… జాతీయ మాతృభూములను లాక్కొని, స్వాధీనం చేసుకునే స్వేచ్ఛ ఉండేది. సర్వోన్నత అధికారం, ప్రాచీన నాగరికతలను అత్యంత నిర్లక్ష్యంగా బలిచేసింది. మానని రణాల వంటి పాలస్తీనా, కాశ్మీర్‌లు ఆధునిక ప్రపంచానికి సామ్రాజ్యవాద బ్రిటన్‌ ఇచ్చిన బహుమతులు. ఈనాడు రగులుతున్న అంతర్జాతీయ ఘర్షణలను పెంచేందుకే సృష్టించిన ఉద్రిక్త పునాదులు.

1937లో విన్‌స్ట్టన్‌ చర్చిల్‌ పాలస్తీనియన్ల గురించి ఇలా అన్నాడు: ”తాను అనుభవించలేని వాటిని ఇతరులకు కాకుండా చేసే వ్యక్తి తనకే ఆ హక్కు ఉంటుందనే విషయాన్ని నేను అంగీకరించను. ఉదాహరణకు అమెరికాలో రెడ్‌ ఇండియన్స్‌కు, ఆస్ట్రేలియాలో నల్లజాతి వారికి సంబంధించి పెద్ద తప్పు జరిగిందంటే నేను ఒప్పుకోను. ఒక బలమైన జాతి, ఉన్నత శ్రేణిలోని జాతి, ప్రాపంచిక జ్ఞానం గల జాతి ఆ రకంగా వచ్చి, వారి స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఈ ప్రజలకు తప్పు జరిగిందనే విషయాన్ని నేనొప్పుకోను.” అదే, పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయిల్‌ రాజ్యం వైఖరిని ఏర్పరిచింది. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి గోల్డా మెయిర్‌, ”పాలస్తీనియన్లు ఉనికిలో లేరు” అని 1969లో అన్నారు. ఆమె వారసుడు, ప్రధానమంత్రి లెవీ ఎస్కోల్‌, ”పాలస్తీనియన్లు ఏమిటి? నేను పాలస్తీనా వచ్చిన ప్పుడు, 2 లక్షల 50 వేల మంది యూదేతరులు, ప్రధానంగా అరబ్బులు, బెడౌయిన్లు ఉండేవారు.” అన్నాడు. ”పాలస ీ్తనియన్లు రెండు కాళ్ల జంతువులు” అని ఒకరు, పాలస్తీనియన్లు అణగదొక్కాల్సిన ”మిడతలు” అని మరొక ప్రధాని అన్నారు. ఇది రాజ్యాధినేతల భాష, ఇవి సామాన్యుల మాటలు కాదు.

భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమి గురించిన భయంకరమైన కథనం అలా మొదలైంది. 1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను విభజించి, పాలస్తీనా భూమిలో 55 శాతం జియోనిస్టులకు కేటాయించింది. సంవత్సరం లోపే వారు 76 శాతం భూమిని స్వాధీనం చేసుకున్నారు. 1948 మే 14న, ఇజ్రాయిల్‌ రాజ్యాన్ని ప్రకటించారు. ఈ ప్రకటన కొద్ది నిమిషాల తరువాత అమెరికా ఇజ్రాయిల్‌ ను గుర్తించింది. వెస్ట్‌ బ్యాంక్‌ ను జోర్డాన్‌లో కలిపారు. గాజా స్ట్రిప్‌, ఈజిప్ట్‌ మిలిటరీ నియంత్రణలోకి వచ్చింది. పాలస్తీనా, శరణార్థులుగా మారిన వందలాది, వేలాది మంది పాలస్తీనా ప్రజల మనసుల్లో, హృదయాల్లో తప్ప ఉనికిలో మాత్రం లేకుండా పోయింది. 1967లో ఇజ్రాయిల్‌ వెస్ట్‌ బ్యాంక్‌, గాజా స్ట్రిప్‌లను ఆక్రమించింది. దశాబ్దాలుగా తిరుగుబాట్లు, యుద్ధాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సంధులు, ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాల్పుల విరమణ జరగాలని ప్రకటించారు, వాటిని ఉల్లంఘించారు. కానీ రక్తపాతం మాత్రం అంతం కాదు. పాలస్తీనా ఇప్పటికీ అక్రమమైన ఆక్రమిత ప్రాంతంగానే మిగిలింది. దాని ప్రజానీకం అమానవీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. వారు అక్కడ సామూహిక శిక్షలకు గురవుతూ, 24 గంటల కర్ఫ్యూలో మగ్గుతున్నారు. ప్రతీరోజు వారిని క్రూరంగా అవమానిస్తున్నారు. వారి ఇళ్ళు ఎప్పుడు కూల్చివేయబడతాయో, వారి పిల్లలపై ఎప్పుడు కాల్పులు జరుగుతాయో, వారి విలువైన చెట్లను ఎప్పుడు నరికివేస్తారో, వారి రోడ్లు ఎప్పుడు మూసివేస్తారో, ఆహార పదార్థాలు, మందులు కొనేందుకు మార్కెట్లకు వెళ్ళేందుకు ఎప్పుడు అనుమతిస్తారో వారికి అస్సలు తెలియదు. వారెలాంటి గౌరవం లేకుండా, కనుచూపు మేరలో ఆశ కనిపించని స్థితిలో బతుకుతున్నారు. వారికి వారి భూములపై, వారి భద్రతపై, వారి కదలికలపై, వారి సమాచారంపై, వారి నీటి సరఫరాపై నియంత్రణ లేదు. తమ ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేని పాలస్తీనా యువకులు తమను తాము మానవ బాంబులుగా మార్చుకొని, ఇజ్రాయిల్‌ వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ వారిని వారు ఆత్మాహుతి చేసుకుంటూ, సాధారణ ప్రజల్ని చంపుతూ, రోజువారీ జీవితంలో భయాన్ని నింపుతూ చివరికి రెండు సమాజాల అనుమానాలను, పరస్పర ద్వేషాన్ని కఠినతరం చేస్తున్నారు. ప్రతీ బాంబు దాడి పాలస్తీనా ప్రజలపై కనికరం లేని ప్రతీకారాన్ని, కష్టాల్ని ఆహ్వానిస్తోంది. అయితే ఆత్మాహుతి దాడి అనేది వ్యక్తిగత నిరాశతో కూడిన చర్య అవుతుంది, అది విప్లవ వ్యూహం కాదు.

ఈ పరిస్థితుల్లో శాంతియుతమైన, నిష్పాక్షిక పరిష్కారాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని ఇజ్రాయిల్‌తో పాటు అమెరికా ప్రభుత్వం నిరోధించింది. ఇజ్రాయిల్‌ చేసిన ప్రతి యుద్ధానికి అమెరికా మద్దతు పలికింది. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడి చేసినప్పుడు, పాలస్తీనియన్ల ఇళ్ళను ధ్వంసం చేసేది అమెరికా క్షిపణులే. ప్రతీ సంవత్సరం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును (కొన్ని బిలియన్‌ డాలర్లను) ఇజ్రాయిల్‌ పొందుతున్నది.నేడు పాలస్తీనా పౌరులపై ఇజ్రాయిల్‌ వేస్తున్న ప్రతి బాంబు, ప్రతి ట్యాంక్‌, ప్రతి బుల్లెట్‌ పైన అమెరికా పేరు ఉంటుంది. అమెరికా హృదయపూర్వక మద్దతు లేకుండా ఇంత జరగదు. డిసెంబర్‌ 8న, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో కాల్పుల విరమణకు అనుకూలంగా 13 సభ్య రాజ్యాలు ఓటు వేసినప్పుడు ఏం జరిగిందో మనం చూశాం, అమెరికా దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. నల్ల జాతి అమెరికన్‌ అయిన అమెరికా డిప్యూటీ అంబాసిడర్‌ ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ చెయ్యి ఎత్తిన వీడియో చూస్తుంటే మనసు దహించివేస్తుంది. సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు చేసిన కొందరు వ్యాఖ్యాతలు దీనిని పీకముడి సామ్రాజ్యవాదం (ఇంటర్‌ సెక్షనల్‌ ఇంపీరియలిజం) అన్నారు.

/ముగింపు తదుపరి సంచికలో/(డిసెంబర్‌ 13న తిరువనంతపురంలో నిర్వహించబడిన పి.గోవింద పిళ్ళై అవార్డు కార్యక్రమంలో అవార్డు గ్రహీత అరుంధతీ రారు ప్రసంగ పాఠం సంక్షిప్తంగా) (”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)అరుంధతీ రాయ్

➡️