- బుమ్రాకు విశ్రాంతి, కేఎల్ రాహుల్ కు దక్కని చోటు
భారత్ – ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అత్యంత కీలకమైన నాలుగవ మ్యాచ్ శుక్రవారం నుంచి రాంచీ వేదికగా మొదలుకానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. ఇక బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ సమస్యలతో జట్టులో చోటు దక్కించుకోలేదు. ధర్మశాల వేదికగా జరగనున్న చివరి మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడడం అతడి ఫిట్నెస్కు లోబడి ఉంటుందని బిసిసిఐ తెలిపింది. కాగా రాజ్కోట్ టెస్టుకు దూరంగా ఉన్న పేసర్ ముకేశ్ కుమార్ ను రాంచీ టెస్టుకి ఎంపిక చేసింది.
టీమిండియా జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.