టీమిండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తనను సంప్రదించినట్లుగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తెలిపాడు. హెడ్ కోచ్గా తాను ఇంట్రెస్ట్గా ఉన్నానో లేదో తెలుసుకునేందుకు బీసీసీఐ తనను సంప్రదించినట్లుగా వెల్లడించాడు. అయితే జాతీయ జట్టుకు కోచ్గా ఉండేందుకు తనకు ఇష్టమేనన్న పాంటింగ్ కానీ ప్రస్తుత తన లైఫ్ స్టైల్కు అది సెట్ కాదన్నారు. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో కనిసం పది నెలలైన జట్టుతో ఉండాల్సి ఉంటుంది.. ఐపీఎల్లో కూడా పనిచేయకూడదు. ప్రస్తుతం తాను ఇంటి వద్ద ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటున్నానని అందుకే బీసీసీఐ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లుగా పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్లో 2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్గా ఉన్న పాంటింగ్.. గతంలో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక టి 20 కోచ్గా ఉన్నా విషయం తెలిసిందే.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/ricky.jpg)