రూ.125కోట్ల ప్రైజ్‌మనీ: బిసిసిఐ

టి20 ప్రపంచకప్‌ నెగ్గిన భారత క్రికెట్‌ జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‌మనీని బిసిసిఐ ప్రకటించింది. ఈ ప్రైజ్‌మనీ టీమిండియా ఆటగాళ్లతోపాటు కోచ్‌లు మరియు సహాయక సిబ్బందికి దక్కనుంది. ఈ విషయాన్ని బిసిసిఐ సెక్రటరీ జే షా ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా తెలియజేశారు. ఇక టి20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారతజట్టుకు రూ.20.42కోట్లు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు రూ.10.6కోట్ల ప్రైజ్‌మనీ ఐసిసి అందజేసింది.

➡️