ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో, అనకాపల్లి ప్రతినిధి విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఎంఎన్.హరీంద్రప్రసాద్ను, అనకాపల్లి జిల్లా కలెక్టర్గా విజయకృష్ణన్ నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ జిల్లాకు రానున్న హరీంద్రప్రసాద్ గతంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. భారత ఎన్నికల సంఘంలో అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (ఎపి)గా విధులు నిర్వహిస్తూవస్తున్నారు. ఏపి ఎన్నికల జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్ అఫీషియో అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు. తమిళనాడులోని అరుణాచలం జిల్లాకు చెందిన ఈయన 2015 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లా కలెక్టర్గా విజయకృష్ణన్ను ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు ఈమె సాంఘిక సంక్షేమ డైరెక్టర్గా పనిచేశారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ రవి పట్టాన్శెట్టికి పోస్టింగ్ ఇవ్వాల్సివుంది. విజయకృష్ణన్ 2013 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి. కొత్తగా ఏర్పడిన బాపట్ల కలెక్టర్గా 2022 ఏప్రిల్ 4 నుంచి 2023 ఏప్రిల్ 13 వరకు పనిచేశారు. తరువాత సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్గా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు.
![Visakha, Anakapalli Collectors](https://prajasakti.com/wp-content/uploads/2024/07/1-Visakha-akp-collectors.jpg)