మళ్లీ కలవరపెడుతున్నకరోనా.. కేరళలో ముగ్గురి మృతి

Dec 21,2023 11:12 #Covid Cases, #kerala
  • గత 24 గంటల్లో 358 కేసుల నమోదు
  • జేఎన్‌.1 కేసుల్లోనూ పెరుగుదల

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని దేశంలోని యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,669కి పెరిగింది. కేరళలో కొవిడ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా కేరళలోనే ముగ్గురు మరణించారు.తాజాగా మరణాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది. తాజా కేసులు కేరళ, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండడంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి.

➡️