ఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరో 12 రోజులు పొడగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న సిసోడియా కస్టడీ శనివారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.కాగా, సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన తిహార్ జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు బెయిల్ పిటిషన్ వేయగా ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించిన విషయం తెలిసిందే.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/manish-sisodiya-copy.jpg)