Schoolsలో ‘ వాటర్‌ బెల్‌ ‘ – 3 సార్లు నీళ్లు తాగాల్సిందే : ఒడిశా విద్యాశాఖ ఆదేశాలు

ఒడిశా : కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల తరహాలోనే ఒడిశా ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ‘ వాటర్‌ బెల్‌ ‘ ను మోగించాలని నిర్ణయించింది. ఎండ తీవ్రత అధికమవుతోన్న వేళ … విద్యార్థులు, ఉపాధ్యాయులకు హైడ్రేషన్‌ బ్రేక్‌ ఇవ్వాలని తాజాగా ఒడిశా విద్యాశాఖ నిర్ణయించింది. కమిషనర్‌ కమ్‌ సెక్రటరీ, అశ్వతి ఎస్‌ బుధవారం డిపార్ట్‌మెంట్‌ జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడు సార్లు ‘వాటర్‌ బెల్స్‌’ మోగించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులను నీరు తాగాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం 8.30, 10, 11 గంటలకు ‘వాటర్‌ బెల్‌’ ను మోగిస్తారు. ఎండ తీవ్రత పెరుగుతోన్న క్రమంలో … విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఒడిశాలో ఏప్రిల్‌ 2 నుంచి ఒక్క పూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 7 నుంచి 11:30 వరకు తరగతులను నిర్వహిస్తున్నారు.

➡️