అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలంటూ … అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్యక్రమాన్ని వివిధ రూపాలలో ఉద్రిక్త చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చెవిలో పూలు పెట్టుకొని పలుచోట్ల ధర్నా నిర్వహించారు.