Servers – పింఛన్లు రెడీ – సర్వర్లు నో రెడీ..!

Jul 1,2024 10:10 #not ready, #pensions, #Ready, #servers

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా పెంచిన పింఛన్లను ఉదయం నుండి పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయటం ఉద్యోగులకు తలనొప్పిగా మారింది. సర్వర్లు మొరాయించడంతో పింఛన్లు పంపిణీకి ఆటంకం ఏర్పడింది. దీంతో మహిళలు, వృద్ధులు ఉదయం 6 గంటల నుండి ఎదురుచూస్తున్నప్పటికీ పది గంటలకు వరకు పింఛన్లు పంపిణీకి అంతరాయం ఏర్పడింది. దీనిపై ఉద్యోగులు రాష్ట్రం అంతా ఒకేసారి పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదని, పని చేసిన తర్వాత అందజేస్తామని వివరించారు. అయితే 10 గంటలకు వరకు పింఛన్లు అందకపోవడంతో అసలు ఈ రోజు ఎప్పటికి అందుతాయా ? అంటూ మహిళలు, వృద్ధులు ఎదురుచూస్తున్నారు. అందరికీ ఒకేసారి పింఛన్లు తలపెట్టిన ప్రభుత్వం సర్వర్‌ లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

➡️