- వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై షర్మిల ఫైర్
- మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?
ప్రజాశక్తి-అమరావతి : రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చారని.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేవారు. . రాష్ట్రంలో ఎలాంటి అభివద్ధి లేదని.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే.. విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా రాలేదని, ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల అన్నారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదని.. ఉన్నవి కూడా ఉంటాయో, లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే.. పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపే చూపించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్ చూపిస్తే.. మూడు రాజధానులంటూ జగనన్న మూడు ముక్కలాట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.